ఏపీ హోంమంత్రి తానేటి వనితి అనకాపల్లి ఘటన జరగడంపై హోంమంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనకాపల్లి చిన్నారి ఘటన, సత్యసాయి జిల్లా పెనుకొండ బీఫార్మసీ విద్యార్థిని ఘటనలపై.. హోంమంత్రి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఆరు బృందాలతో గాలించి నిందితుడిని పట్టుకున్నట్లు అనకాపల్లి ఎస్పీ గౌతిమి శాలి తెలపగా.. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాధిత కుటుంబసభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సత్యసాయి జిల్లా పెనుకొండ ఘటనలో నిందితుడు సాదిక్ను వెంటనే అరెస్ట్ చేసినట్లు.. జిల్లా ఎస్పీ రాజుదేవ్ సింగ్ హోంమంత్రికి తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రులు కోరినట్లు రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు హోంమంత్రికి వివరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement