Wednesday, March 27, 2024

కాలిపోయిన హరితహారం చెట్లు

పొలంలో వేసిన మాటలు అంటుకుని హరితహారంలో నాటిన చెట్లు కాలి బూడిదైన సంఘటన మహబూబాద్ జిల్లా చిన్న గూడూరు మండలంలో జరిగింది. జయ్యారం వెళ్లే రహదారి పక్కన ఉన్న పోలంలో ఉన్న వ్యర్థాలకు యాజమాని నిప్పు పెట్టాడు. అయితే, ఆ మంటలు కాస్త వ్యాపించి పొలం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న హరితహారం చెట్లకు అంటుకున్నాయి. దాదాపు 30 వరకు ఎదిగిన చెట్లు మంటల్లో కాలిపోయాయి. దీంతో బాధ్యుడైన భూస్వామి పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నిర్లక్ష్యానికి గురి చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement