Friday, April 26, 2024

ఆ ఈవోను విధుల నుంచి తొలగించాలని హైకోర్టు ఆదేశం

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో నరసయ్య ను విధుల నుంచి తొలగించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. గతంలో నిధులను దుర్వినియోగం చేసినట్లూ ఇఓ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఈఓగా నరసయ్య కొనసాగడాన్ని సవాలు చేస్తూ కెబి. షెతురామాన్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖల్ చేశారు. వీటిని పరిశీలించిన కోర్టు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఈవోను కొనసాగించడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఎం. సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం వీటిపై విచారణ చేపట్టారు. అనంతరం ఈవో నరసయ్య ను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement