Monday, April 29, 2024

పద్మావతి నిలయంలో ఎలాంటి మార్పులొద్దు

తిరుపతిలో శ్రీ పద్మావతి నిలయాన్ని కలెక్టరేట్‌కు ఇచ్చే అంశంపై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం టీటీడీకి చెందిన శ్రీపద్మావతి నిలయంలో ఎలాంటి మార్పులు చేయవద్దని ఆదేశించింది. కలెక్టరేట్‌ ఏర్పాటుకు ఇచ్చిన ప్రొసీడింగ్స్‌పై యథాతథ స్థితి పాటించాలని సూచించింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 29కి హైకోర్టు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement