Thursday, May 16, 2024

భీమ్లా నాయక్‌ను టార్గెట్‌ చేసిన ఏపీ సర్కార్‌.. జీఓ ప్రకారమే టికెట్ అమ్మాల‌ని ఆదేశాలు

పవన్‌ కల్యాణ్‌ను ఏపీ సర్కార్‌ టార్గెట్‌ చేసింది. పవన్‌ కల్యాణ్‌ నటించిన వకీల్‌ సాబ్‌ సినిమా రిలీజ్‌ సమయంలో టికెట్‌ రేట్లను తగ్గిస్తూ ఉత్తర్వులు తీసుకొచ్చిన జగన్‌ ప్రభుత్వం.. తాజాగా మరోసారి దెబ్బకొట్టేందుకు సిద్ధమైంది. పవన్‌ కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో నటించిన భీమ్లా నాయక్‌ సినిమా ఈ నెల 25న రిలీజ్ కానుంది. అయితే, భీమ్లా నాయక్‌ సినిమాను ప్రదర్శించే సినిమా థియేటర్లు టికెట్లను జీవో ప్రకారమే విక్రయించాలని ఏపీ ప్ర‌భుత్వం మెలిక పెట్టింది.

ఈ మేరకు భీమ్లా నాయక్‌ చిత్ర విడుదల నేపథ్యంలో రాష్ట్రంలోని థియేటర్లకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందస్తు నోటీసులు జారీ చేసింది. కొత్త చిత్రాల బెనిఫిట్‌ షో, అదనపు షోలు వేయరాదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని, టికెట్‌ ధరలు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. థియేటర్ల వద్ద రెవెన్యూ అధికారుల నిఘా ఉంటుందని నోటీసులో వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement