Friday, April 26, 2024

రేషన్‌ కార్డుదారులు గుడ్ న్యూస్.. బియ్యానికి బదులుగా నగదు పంపిణీ

ఏపీలో ఇక మీదట రేషన్‌ కార్డుదారులు అవసరమైతే బియ్యం తీసుకోవచ్చు. వద్దంటే ప్రభుత్వం నిర్ణయించిన మేరకు డబ్బులు ఇస్తుంది. మే నెల నుంచి నగదు బదిలీ కార్యక్రమం అమలు దిశగా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అంగీకరించిన కార్డుదారులకు బియ్యానికి బదులుగా ప్రతి నెలా నగదు పంపిణీ చేస్తారు. తొలుత జీవీఎంసీ పరిధిలోని అనకాపల్లి, గాజువాక ప్రాంతాలతో పాటు నర్సాపురం, నంద్యాల, కాకినాడ ప్రాంతాలలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. కిలోకు 12 నుంచి 15 మధ్య ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. 2 నెలలు నగదు తీసుకున్నా, ఆ తర్వాతి నెలలో బియ్యం కావాలంటే తీసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement