Thursday, May 2, 2024

APPSC ఛైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్‌

రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) ఛైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గౌతమ్‌ సవాంగ్‌ను నియమిస్తూ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నోటిఫికేషన్ జారీ చేశారు.

కాగా, ఇటీవల డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై ఆకస్మికంగా బదిలీ వేటు పడిన సంగతి తెలిసిందే. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా పోస్టింగు ఇవ్వలేదు. సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. అనంతరం ఆయనను ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement