Saturday, April 27, 2024

‘భీమ్లా నాయక్‌’కి ఏపీ సర్కార్ షాక్.. థియేటర్లకు ముందస్తు నోటీసులు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్‌’ చిత్రానికి ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. ఈ భీమ్లా నాయకర్ చిత్ర విడుదల నేపథ్యంలో రాష్ట్రంలోని థియేటర్లకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందస్తు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు కొత్త చిత్రాల బెనిఫిట్‌ షో, అదనపు షోలు వేయరాదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని, టికెట్‌ ధరలు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. థియేటర్ల వద్ద రెవెన్యూ అధికారుల నిఘా ఉంటుందని నోటీసులో వెల్లడించారు.

కాగా, పవన్‌ కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్‌ చిత్రం ‘భీమ్లా నాయక్‌’. ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ బుధవారం యూసుఫ్‌ గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో జరిగింది. కాగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు ఎమ్మెల్యే మాగంటి గోపినాద్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ చిత్రం ఫిబ్రవరి 25న థియేటర్లలో సందడి చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement