Tuesday, May 7, 2024

ఎస్ఈసీగా నేడు బాధ్యతలు స్వీకరించనున్న నీలం సాహ్ని

ఏపీ కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ వెంటనే ఆమె పరిషత్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించే అవకాశం వుంది. ఐదేళ్ల పాటు పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవి విరమణ చేశారు. అంతేకాదు ఏపీ లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 8న ఎన్నికలు, 10న కౌంటింగ్ జరిపే అవకాశం వుంది.

నీలం సాహ్ని ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. గత రెండేళ్ల నుంచి ఆమె జగన్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. నీలం సాహ్ని 1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి కావడం గమనార్హం. ఉమ్మడి ఏపీలో మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్‌గా ఆమె సేవలందించారు. నల్గొండ జాయింట్ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా పనిచేశారు. టెక్కలి సబ్ కలెక్టర్‌గా కూడా సేవలందించారు. విభజిత ఏపీలో రెండు కీలక పదవులు చేపట్టిన మహిళగా నీలం సాహ్ని చరిత్ర సృష్టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement