Thursday, May 16, 2024

ఏపీలో మరోసారి పెరిగిన కరోనా కేసులు..

ఏపీలో కరోనా కేసుల సంఖ్య మరోసారి స్వల్పంగా పెరిగాయి. తాజాగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. 85,822 మందికి పరీక్షలు నిర్వహించగా 2,442 కేసులు పాజిటివ్ గా నిర్థారణ అయ్యాయి. కాగా మరో 2,412 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా కరోనాతో గడిచిన 24 గంటల్లో 16 మంది మృత్యువాత పడ్డారు. తాజా మృతుల్లో చిత్తూరులో ఐదుగురు, అనంతపురం, కృష్ణా, నెల్లూరు జిల్లాలో ఇద్దరు చొప్పున.. తూర్పుగోదావరి, గుంటూరు, కడప, కర్నూలు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.. మొత్తంగా రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,73,996కు పెరగగా… రికవరీ కేసుల సంఖ్య 19,40,368కు చేరింది. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 13,444 మంది మృతిచెందారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 20,184 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

ఇది కూడా చదవండి: వాసాలమర్రిలో రేపటి నుంచే దళిత బంధు అమలు

Advertisement

తాజా వార్తలు

Advertisement