Friday, May 17, 2024

మాజీ సీఎం యడియూరప్పకు హైకోర్టు నోటీసులు

కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. అవినీతి ఆరోపణలకు సంబంధించి మాజీ సీఎం యడియూరప్ప, ఆయన కుమారుడు విజయేంద్ర, వారి సన్నిహితులందరికీ కర్ణాటక హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని లంచాలు తీసుకున్నారని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త టి.జె.అబ్రహం కోర్టును ఆశ్రయించారు. బెంగుళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (BDA) యొక్క గృహ నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి అవినీతి జరిగిందని పిటిషనర్ పేర్కొన్నారు.  ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుటుంబ సభ్యులు లంచం మొత్తాన్ని సేకరించారని ఆరోపించారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ సునీల్‌ దత్‌ యాదవ్‌‌తో కూడిన ధర్మాసనం యడియూరప్ప, విజయేంద్ర, శశిధర్‌ మరడి, సంజయ్‌ శ్రీ, చంద్రకాంత రామలింగం తదితరులకు నోటీసులు జారీచేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement