Thursday, May 2, 2024

ఏపీలో ఏమాత్రం తగ్గని కరోనా..

ఏపీలో కొత్త కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ కొత్తగా 1546 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్ బారినపడిన వారిలో 1940 మంది కోలుకున్నారు. ఇన్ఫెక్షన్‌ కారణంగా 18 మంది మృతి చెందారు. ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసులు 19,71,554కు పెరిగాయి. ఇవాళ్టి వరకు మొత్తం 19,37,956 మంది కోలుకున్నారు. ఇంకా 20,170 యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13,428కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 69,606 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కరోనా మహమ్మారికి ఇవాళ చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.

ఇది కూడా చదవండి: బండ్ల గణేష్ కొడుకుని చూడండి ఎలా ఉన్నాడో..

Advertisement

తాజా వార్తలు

Advertisement