Thursday, April 18, 2024

దేవినేని ఉమ బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో మంగళవారం నాడు వాదనలు ముగిశాయి. దీంతో తీర్పును హైకోర్టు రేపటికి రిజర్వ్ చేసింది. కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే సమాచారంతో పరిశీలన కోసం ఉమ అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలో జి.కొండూరు ప్రాంతంలో అలజడి చెలరేగింది. దీనికి దేవినేని ఉమ కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. కుట్ర, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు.

కాగా గత బుధవారం దేవినేని ఉమాకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉమ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులకు ఎలాంటి ఆధారాలు లేవని… అందువల్ల బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. మరోవైపు ఇటీవల దేవినేని ఇంటికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుటుంబసభ్యులను పరామర్శించిన సంగతి తెలిసిందే.

ఈ వార్త కూడా చదవండి: అమర్‌రాజా కంపెనీని మేమే పొమ్మన్నాం: సజ్జల

Advertisement

తాజా వార్తలు

Advertisement