Sunday, April 28, 2024

AP CM: నేడు హైద‌రాబాద్‌కు జ‌గ‌న్‌.. మేన‌ల్లుడి ఆశీర్వ‌దించ‌నున్న ఏపీ సీఎం

ఏపీ సీఎం జగన్ ఇవాళ‌ హైదరాబాద్‌కు రానున్నారు. తన మేనల్లుడు, వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి ఎంగేజ్‌మెంట్ వేడుకలో ఆయన పాల్గొననున్నారు. సీఎం జగన్ సాయంత్రం తాడేపల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరతారు.

హైదరాబాద్ లోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్ లో వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థ వేడుకకు జగన్ హాజరుకానున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకొని రోడ్డు మార్గంలో గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌కు చేరుకుంటారు. అక్కడ జరిగే రాజారెడ్డి, ప్రియా అట్లూరి ఎంగేజ్‌మెంట్‌ వేడుకలో పాల్గొని.. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లికి పయనమవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement