Saturday, April 27, 2024

ఏపీ మంత్రివర్గ సమావేశం వాయిదా.. 24వ తేదీన ఉంటుంద‌న్న అధికారులు

అమరావతి, ఆంధ్రప్రభ : ఈనెల 22న జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. మంత్రివర్గ సమావేశాన్ని ఈనెల 24వ తేదీకి వాయిదా వేస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 24న ఉదయం 11 గంటలకు సచివాలయంలో సమావేశం జరుగుతుందని సీఎస్‌ కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు సమాచారాన్ని మంత్రులు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు సీఎస్‌ కార్యాలయం పంపింది.

ఈనెల 23న సీఎం తిరుపతి పర్యటన నేపథ్యంలో ఒకరోజు ముందుగా ఆయన తిరుపతి చేరనున్నట్లు సమాచారం. ఈ నేపద్యంలో మత్రివర్గ సమావేశాన్ని ముందుగా ప్రకటించినట్లు- గాకుండా 24కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement