Saturday, April 27, 2024

AP Budget : రూ.2,86,389.27 కోట్లతో ఏపీ బడ్జెట్.. బుగ్గన

ఏపీ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశ పెట్టారు. రూ. 2,86,389.27 కోటతో ఏపీ బడ్జెట్‌ను రూపొందించారు. ఆదాయ వ్యయం రూ.2,30,110.41 కోట్లు, మూల ధన వ్యయం రూ.30,530.18 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 24,758.22 కోట్లు, ద్రవ్య లోటు రూ.55,817.50 కోట్లు, జీఎస్డీపీలో ద్రవ్య లోటు 3.51 శాతం, రెవెన్యూ లోటు 1.56 శాతం ఉన్నట్లు బుగ్గన తెలిపారు. ఏ వర్గాన్నీ మర్చిపోకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో బడ్జెట్‌ను రూపొందించినట్లు బుగ్గన వెల్లడించారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని బుగ్గన పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా పథకాలను అమలు చేశామని చెప్పారు. మేనిఫెస్టోను సీఎం జగన్ పవిత్ర గ్రంథంలా భావించారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

రాజకీయాలకు అతీతంగా పథకాలను అమలు చేశామని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలే తమ ప్రభుత్వానికి ఆదర్శమన్నారు. చాణుక్యుడిలా రాష్ట్రాన్ని సీఎం జగన్ పాలిస్తున్నారన్నారు. 1000 పాఠశాలలో సీబీఎస్ఈ సిలబస్‌ను అమలు చేశామని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.

ఇక జగనన్న విద్యా కానుక ద్వారా 47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని బుగ్గన చెప్పారు. రూ. 3,367 కోట్లతో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్‌లు అందజేశామన్నారు. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాను 26కు పెంచామన్నారు. 52 రెవెన్యూ డివిజన్లను 77కు పెంచాశామని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా గత ప్రభుత్వం కన్నా నాలుగు రెట్లు ఎక్కువ ఖర్చు చేశామన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా 35 లక్షల పిల్లలకు ప్రయోజనం చేకూర్చామన్నారు. ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందని ఈ సందర్భంగా బుగ్గన హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

సుపరిపాలన, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, సంపన్నుల ఆంధ్ర, సంక్షే ఆంధ్ర, భూ భద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర ఆంశాల ఆధారంగా బడ్జెట్‌ను రూపొందించామన్నారు. రూ. 2 లక్షల 86 వేల 389 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో మంత్రి బుగ్గన ప్రవేశ పెట్టారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బోధనా ఆస్పత్రులకు రూ. 16,852 కోట్లు ఖర్చు చేసినట్లు బుగ్గన పేర్కొన్నారు.

విదేశాల్లోని 50 ఉన్నత విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులకు సాయం అందించామన్నారు. డ్రాప్ అవుట్ శాతం 20.37 నుంచి 6.62 శాతానికి తగ్గిందని తెలిపారు. 34 లక్షల మందికి ఉచితంగా విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేశామన్నారు. జగనన్న విద్యా వసతి దీవెనకు రూ. 4,267 కోట్లు కేటాయించామన్నారు. జగనన్న విద్యా దీవెనకు రూ.11901 కోట్లు విడుదల చేశామని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement