Sunday, April 28, 2024

Sharmila: కేంద్రం పై క‌లిసి పోరాడుదాం…జ‌గ‌న్‌, చంద్ర‌బాబుకు ష‌ర్మిల బ‌హిరంగ లేఖ‌…

రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి ప‌దేళ్లు అవుతుంది…. కానీ కేంద్రం విభ‌జ‌న హామీల‌ను అమ‌లు చేయ‌లేద‌ని… హామీల అమ‌లు కోసం అంద‌రం క‌లిసి కేంద్రం పై పోరు చేయాల‌ని ఏపీసీసీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల పేర్కొన్నారు. ఆమె సీఎంజ‌గ‌న్‌, చంద్ర‌బాబుల‌కు బ‌హిరంగంగా లేఖ రాశారు. విభజన హామీల అమలుపై అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి, కేంద్రానికి పంపాలని కోరారు.

ఏపీ విభజన హామీల అమలు ఐదున్నర కోట్ల ఆంధ్రుల హక్కు అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లుగా వీటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ఆమె విమర్శించారు. రాష్ట్రాన్ని ఇంకా మోసం చేస్తూనే ఉంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని అన్నారు.

- Advertisement -

కేంద్రానికి విభజన హామీలను గుర్తు చేస్తూ పోరాటం సాగించాలని చెప్పారు.విభజన హామీలపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి పంపాలని లేఖలో ఆమె సూచించారు. తన లేఖలో తమ డిమాండ్లను మీ ముందుంచామని చెప్పారు. మీమీ పార్టీల తరపున అసెంబ్లీ వేదికగా చర్చించాలని అన్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా అందరం చేయాల్సిన పోరు అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement