Sunday, April 28, 2024

AP – కసిగా ఎదుర్కోండి.. రెండు నెలలు శ్రమించండి – కార్యకర్తలకు భువనేశ్వరి పిలుపు

చోడవరం – ప్రజాస్వామ్య రాష్ట్రంలో ప్రజల హక్కుల్ని హరిస్తున్న కసాయి వైసీపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం కార్యకర్తలంతా కసిగా ఎదుర్కోవాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పిలుపు నిచ్చారు. నిజం గెలవాలి నినాదంతో ఉత్తరాంధ్రాలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా చోడవరం నియోజకవర్గం,రోలుగుంట మండలం, జే. పీ అగ్రహారం గ్రామంలో చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన పార్టీ కార్యకర్త సుర్ల దేవుడమ్మ కుటుంబాన్ని, రావికమతం మండలం, గంపవానిపాలెం గ్రామంలో మృతి చెందిన పార్టీ కార్యకర్త మాకిరెడ్డి పెద్దమ్మ కుటుంబాన్ని అమె పరామర్శించారు.

ఈ సందర్భంగా చోడవరంలో భువనేశ్వరీ మాట్లాడుతూ, రానున్న రెండు నెలలు పట్టుదలతో కృషి చేసి తెలుగుదేశం జెండాను ఎగరేయాలని కోరారు. వైసీపీ పాలనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, రాసినా దాడులు, హత్యలు చేస్తున్నారని, వాళ్లకు హింసించటమే తెలుసన్నారు. ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తును కసాయి మూకల చేతిలో నుంచి రక్షించుకోవడానికి ఓటే మన ఆయుధమని, రానున్న ఎన్నికల్లో ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగించుకునేందుకు, అక్రమాలు, దౌర్జన్యాలు జరగకుండా చూసుకునేందుకు యువత ముందడుగు వేయాలని వైసీపీ మూకల కుట్రలను తిప్పికొడుతూ ఎన్నికలు జరిగే వరకు కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని భువనేశ్వరీ కార్యకర్తలను కోరారు. చంద్రబాబుపై మీరు చూపించే ప్రేమను మేము ఎప్పటికీ మరువలేం, ఆయన కుటుంబాన్ని వదిలి, మీకోసం ఎందుకు కష్టపడుతున్నారో బయటకు వచ్చాక నాకు తెలిసిందని, ఆయన మీ మనిషి…మీ నుంచి ఆయనను ఏ శక్తీ దూరం చేయలేదని భువనేశ్వరీ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement