Thursday, May 2, 2024

AP | షర్మిలకు ఈసీ నోటీసులు…

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. వైసీపీ నేతలు మల్లాది విష్ణు, అవినాష్ రెడ్డితో పాటు వివేకా కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాజాగా ఆమెకు నోటీసులు పంపారు. కడప లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన వైఎస్‌ షర్మిల.. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో వైఎస్‌ అవినాష్‌ తదితరుల పాత్ర ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో వివేకా కేసు పదే పదే ప్రస్తావనకు వస్తోంది. వివేకా కేసుపై వ్యాఖ్యానించవద్దని కడప కోర్టు ఇప్పటికే ఆమెను ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement