Sunday, April 28, 2024

TS | నటుడు రఘుబాబుకు బెయిల్ మంజూరు..

బీఆర్‌ఎస్‌ నేత సంధినేని జనార్ధన్‌రావు యాక్సిడెంట్‌ కేసులో సినీ నటుడు రఘుబాబుకు కోర్టులో ఊరట లభించింది. అతనికి బెయిల్ మంజూరు చేస్తూ నల్గొండ కోర్టు తీర్పునిచ్చింది. ఈ నెల 17న నల్గొండ శివారులో రఘుబాబు కారు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. మృతుడు భార్య నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక‌ రఘుబాబుని అదుపులోకి తీసుకున్న పోలీసులు నేడు నల్గొండ కోర్టులో ఆయనను హాజరుపరిచ‌గా… ఆయనకు నల్గొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన విచారణ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement