Sunday, April 28, 2024

UPSC మార్కుల జాబితా విడుదల…

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో 664 మంది పురుషులు, 352 మంది మహిళలు మొత్తం 1016 మంది అర్హత సాధించారు. మంగళవారం సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. కాగా, శుక్రవారం యూపీఎస్సీ మార్కుల జాబితాను కమిషన్ విడుదల చేసింది. మొత్తం 1,016 మంది అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూపీఎస్సీ తన వెబ్‌సైట్‌లో ఉంచింది.

యూపీఎస్సీ టాపర్ ఆదిత్య శ్రీవాత్సవ 54.27 శాతం సాధించినట్లు కమిషన్ విడుదల చేసిన జాబితా ప్రకారం తెలుస్తున్నది. రెండవ స్థానంలో ఉన్న అనిమేష్ ప్రధాన్ 52.69 శాతం సాధించారు. మూడో స్థానంలో ఉన్న దోనూరు అనన్య రెడ్డికి 52.59 శాతం సాధించింది. యూపీఎస్సీ ఏటా సిఎస్‌ఇని మూడు దశలుగా ప్రాథమిక, మెయిన్, వ్యక్తిత్వ పరీక్ష (ఇంటర్వూ) నిర్వహిస్తుంటుంది. మొత్తం 2025 మార్కులలో నుంచి మెరిట్‌ను నిర్ధారిస్తార. లిఖిత లేదా మెయిన్ పరీక్షకు1750 మార్కులు, ఇంటర్వ్యూకు 275 మార్కులు ఉంటాయి.

  • లక్నో (యుపి)కి చెందిన 27 ఏళ్ల ఆదిత్యకు మొత్తం 1099 మార్కులు వచ్చాయి. లిఖిత పరీక్షలో 899, వ్యక్తిత్వ పరీక్షలో 200 మార్కులు లభించాయి.
  • ఒడిశా అంగుల్ జిల్లాలోని తాల్చేర్ పట్టణానికి చెందిన అనిమేష్ ప్రధాన్ లిఖిత పరీక్షలో 892, ఇంటర్వ్యూలో 175 మార్కులు వెరసి 1067 మార్కులతో రెండవ ర్యాంక్ సాధించారు.
  • ఆర్థికంగా బలహీన వర్గాల అభ్యర్థిగా పరీక్షకు హాజరైన మూడవ ర్యాంకు విజేత దోనూరు అనన్య రెడ్డికి 1065 మార్కులు (52.59 శాతం) లభించాయి. తెలంగాణ మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్యకు మెయిన్‌లో 875, ఇంటర్వూలో 190 మార్కులు వచ్చాయి.
  • నాలుగవ ర్యాంకు విజేత పికె సిద్ధార్థ్ రామ్‌కుమార్‌కు లిఖిత పరీక్షలో 874, ఇంటర్వూలో 185 వెరసి 1059 మార్కులు (52.29 శాతం) లభించాయి.
  • రుహాని 1049 మార్కులు (51.8 శాతం)తో ఐదవ ర్యాంకు పొందింది. లిఖిత పరీక్షలో 856, ఇంటర్వూలో 193 మార్కులు వచ్చాయి.

ఇది ఇలా ఉండగా, 240 మంది అభ్యర్థులను రిజర్వ్‌డ్ జాబితాలో ఉంచినట్లు యూపీఎస్సీ తెలిపింది. ఇక ఐఏఎస్‌లో 180, ఐపీఎస్‌లో 37, ఐపీఎస్‌లో 200, వివిధ సెంట్రల్ గ్రూప్ ఎ సర్వీసెస్‌లో 613 పోస్టులు, గ్రూప్ బి సర్వీసుల్లో 113 ఖాళీలను 2023 సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నివేదించినట్లు యూపీఎస్సీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement