Saturday, April 27, 2024

Breaking: అవినాష్ కు ముందస్తు బెయిల్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టులో ఆయన కు ముందస్తు బెయిల్ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. మరో వైపు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని కూడా హైకోర్టు షరతు విధించింది. విచారణకు సహకరించాలని హైకోర్టు వైఎస్ అవినాష్ రెడ్డికి సూచించింది.

ముందస్తు బెయిల్ పిటిషన్ ను విచారించేలా తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ను ఆదేశించాలని సుప్రీంకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి ఈనెల 22న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పూర్తిస్థాయిలో విచారించి తుది ఉత్తర్వులివ్వాలని ఆ పిటిషన్ లో అవినాష్ రెడ్డి కోరారు. ఈ పిటిషన్ పై ఈనెల 23న సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. ఈనెల 25న ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈనెల 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించింది. అన్నివర్గాల వాదనలను హైకోర్టు విన్నది. ఈనెల 31న తుది తీర్పును వెల్లడించనున్నట్టుగా తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తెలిపింది. ఈ ఉదయం పదిన్నర గంటలకు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ను మంజూరు చేస్తున్నట్టుగా ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement