Thursday, May 9, 2024

ఏఈ పోస్టుల పరీక్షా కేంద్రాల నమోదుకు మరో అవకాశం..

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రభుత్వంలోని వివిధ విభాగాలలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల కోసం నిర్వహించే పరీక్షలకు సంబంధించి టెస్ట్‌ సెంటర్లను అభ్యర్థులు నమోదు చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మరో అవకాశాన్ని కల్పించింది. బుధవారం ఒక ప్రకటనలో ఈ నెల 20వ తేదీ వరకు అభ్యర్థులు హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో టెస్ట్‌ సెంటర్లను నమోదు చేసుకోవచ్చని సూచించింది.

అభ్యర్థులు 3 కేంద్రాలకు ఆప్షన్‌ పెట్టుకోవచ్చని, మొదట ఎంపిక చేసుకున్న వారికి మొదట కేటాయించడం జరుగుతుందని స్పష్టం చేసింది. ఎవరైనా అభ్యర్థులు టెస్ట్‌ సెంటర్‌ను నమోదు చేసుకోకుంటే ర్యాండమ్‌గా ఖాళీ ఉన్న కేంద్రాలు కేటాయించడం జరుగుతుందని పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement