Saturday, May 4, 2024

Anganwadi – అవి పాల ప్యాకెట్లా….ప్యాకెట్ బాంబులా….జ‌గ‌న్ ను నిల‌దీసిన నారా లోకేష్ (వీడియోతో)

అమ‌రావ‌తి – ఏపీ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పాల ప్యాకెట్లపై జ‌గ‌న్ ముద్ర‌తో క‌ల్తీపాల‌ను అందిస్తున్నారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపణలు చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.

‘పసిపిల్లలకిచ్చే పాలనూ వదలవా సైకో జగన్! రాష్ట్రంలో జె-బ్రాండ్ల మద్యంతో లక్షలాది మహిళల తాళిబొట్లు తెంచుతున్న సైకో జగన్ అవినీతిదాహం పరాకాష్టకు చేరింది. పాపపు సొమ్ము కోసం పసిపిల్లలు, బాలింతలకు ఇచ్చే పాలను సైతం కల్తీచేస్తూ కాలకూట విషంగా మార్చారు. అంగన్వాడీ కేంద్రాలకు ఇప్పటివరకు టెట్రా ప్యాకుల్లో సరఫరా చేస్తున్న పాలను తాజాగా సైకో జగన్ ముఖారవిందంతో లీటరు పాలిథిన్ పౌచుల్లో సరఫరా చేస్తున్నారు. ఈనెల 3వతేదీన ప్యాక్ చేసినట్లుగా చెప్పబడుతున్న ఈ పాలప్యాకెట్లకు డిసెంబర్ 2వ తేదీవరకు ఎక్స్పైరీ డేట్ ఉన్నా . సరఫరా చేసిన రెండురోజులుకే గ్యాస్ బాంబుల్లా ఉబ్బి పేలిపోతున్నాయి. ఇవి చూశాక రక్తం రుచిమరిగిన మృగానికి, అడ్డగోలు సంపాదనకు అలవాటుపడిన జగన్ రెడ్డికి పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తోంది’ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement