Saturday, May 4, 2024

AP: నంద్యాలలో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ భేటీ

నంద్యాల : ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాలలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో శనివారం టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు, అనంతరం నెలకొన్న పరిస్థితులు, తదితర అంశాలపై చర్చించనున్నారు.

చంద్రబాబును అరెస్టు చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద సమావేశం నిర్వహించనుండటం విశేషం. ఇందులో భాగంగానే సమావేశంలో పాల్గొనేందుకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నంద్యాలకు చేరుకున్నారు. ఈసందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement