Wednesday, May 22, 2024

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్ద‌రు విద్యార్థులు మృతి

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కళ్యాణదుర్గం మండలం, గోళ్ళ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని ద్విచక్ర వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో బాలు, విక్కీ అనే ఇద్దరు డిగ్రీ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement