Wednesday, May 15, 2024

రౌడీ షీట‌ర్ల వీరంగం.. ఒక‌రిపై ఒక‌రు క‌త్తుల‌తో దాడులు..

తాడిపత్రి విద్యుత్ సబ్ స్టేషన్‌లో అర్ధరాత్రి రెండు గ్యాంగులు వీరంగం సృష్టించాయి. మద్యం మత్తులో రౌడీ షీటర్ పరమేష్, నాగేశ్వర్ రెడ్డి వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇరు వ‌ర్గాలు కత్తులు, ఇనుపరాడ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అంతే కాకుండా సబ్ స్టేషన్‌లోని విలువైన ఫర్నిచర్, కుర్చీలు, విద్యుత్ పరికరాలు, కిటీకి అద్దాలు, ద్విచక్ర వాహనాను కూడా ధ్వంసం చేశారు.. విష‌యం తెలుసుకున్న పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి వారంద‌ర్ని అదుపులోకి తీసుకున్నారు.. గాయ‌ప‌డిన వారిని చికిత్స కోసం హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు.. రెండు వ‌ర్గాల‌పైనా కేసులు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement