Monday, April 29, 2024

Tadipatri: ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అత్యాచారం… పోక్సో కేసు నమోదు

తాడిపత్రి టౌన్, జూన్ 29 (ప్రభ న్యూస్): ప్రేమ పేరుతో ఒక దుర్మార్గుడు ఎస్సీ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ ఆనందరావు తెలిపిన వివరాల మేరకు.. కడప జిల్లా కసాపురం మండలం చెన్నూరు గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక తాడిపత్రి పట్టణంలోని ఆంజనేయ మన్యం కాలనీలో తన పిన్నమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటుంది.

అయితే కొలిమిగుండ్ల మండలం గురువానపల్లి గ్రామానికి చెందిన ఆఫీజ్ అనే కారు డ్రైవరు మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో తనను పెళ్లి చేసుకుంటానంటూ వంచన చేసి గర్భవతిని చేశాడు. ఆఫీజ్ తోపాటు తల్లిదండ్రులు కూడా మైనర్ బాలికను తన కొడుకుకు ఇచ్చి వివాహం చేస్తామని హామీ ఇచ్చినట్లు సీఐ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై పోక్సో, ఎస్సీ ఎస్టీ, చీటింగ్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement