Thursday, May 16, 2024

సర్వ దు:ఖహరం ద్వారకామయి ప్రవేశం

సద్గురు సాయినాథుడు నివసించిన మసీ దే ద్వారకామయి. గురు స్థానం నుంచి బాబా మసీదుకు వచ్చే సమయానికి మసీదు శిథిలావ స్థలో ఉంది. ఇటుకలు, మట్టి రాలి పడుతూ ఉండే వి. అయినా అక్కడే నివసించేవారు. అక్కడే ధుని ని ప్రతిష్టించారు. తనను దర్శించిన వచ్చిన భక్తు ల కష్టాలను తీర్చేవారు. కన్నీటిని తుడిచేవారు. ఆనాటి ఆ ద్వారకామయిని దర్శించలేకపోయా ము. ప్రస్తుతం షిరిడీలో వున్న ద్వారకామయిలో బాబా జ్ఞాపక చిహ్నాలు వున్నాయి. వాటిని దర్శిస్తే ఆనాటి మధుర స్మృతులు మన కళ్ళముందు నిలుస్తాయి. ఎవరైనా సరే ద్వారకామయిలో ప్రవేశిస్తే కష్టాలు తీరిపోతాయి. సుఖసంతోషా లతో జీవిస్తారు. ద్వారకామయిలో బాబా స్నానా నికి ఉపయోగించే స్నానపు రాయి ఉంది. ఇక్కడ వున్న బాబా చిత్రానికి చాలా మహత్తు ఉంది. విలే పార్లేకి చెందిన శ్యాంరావు ఆర్‌.వి.జయకర్‌ ఈ చిత్రం గీశాడు. బాబా ఆశీస్సులతో ఆ పటాన్ని ఇంటికి తీసుకు వెళ్లి పూజలో పెట్టుకుందామను కుని బాబా వద్దకు ఆ పటం తీసుకెళ్ళాడు. నా నిష్క్రమణ అనంతరం ఈ పటం ద్వారా నేను నా భక్తుల శ్రేయస్సు చూస్తుంటాను. ఈ పటం ఇక్కడే ఉండనీ అని చెప్పారట సాయిబాబా. ప్రస్తుతం ఈ పటం ఉన్న స్థలంలోనే బాబా కాళ్ళు జాపుకుని కూర్చునేవారట. అలా కూర్చున్నప్పుడు వారి కాళ్ళ ముందు న్న స్తంభం వరకు వచ్చేవట.
అనేకమంది భక్తులు నేటికీ తాము తమ నివాసాలకు వెళ్లేందుకు బాబా అనుమతి ఇక్కడి నుంచే పొందుతారు. ఇక్కడనుంచే చాలామంది కి బాబా నుంచి ఆదేశాలు అందుతుంటాయి. ఇక్కడ ఓ పక్కన బస్తాలో గోధుమలుంటాయి. బాబా గోధుమలు విసిరిన తిరగలి వుంటుంది. బాలాజీ పాటిల్‌ నెవాస్కర్‌ అనే భక్తుడు తన పంటను బాబాకు సమర్పించి బాబా తనకు తిరిగి ఇచ్చిన దానితోనే కుటుంబాన్ని పోషించుకునె  వాడు. ఈయన తరువాత ఆయన కొడుకు కూడా అలాగే చేసేవాడు. అతని స్మృతికి చిహ్నంగా ఓ గోధుమల బస్తాను నేటికీ అక్కడ ఉంచుతారు. షిరిడీలో రెండు తిరగళ్ళు మనకు కనిపిస్తాయి. ఒకటి ఇక్కడ, మరొకటి సమాధి మందిరంలో. బాబా వీటితో గోధుమలు విసిరేవారట. మసీదు
లో ఒక పక్కన జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఈ
జ్యోతి ఉన్న స్థానంలో బాబా నీటితో దీపాలు వెలి గించారు. ఇక్కడ గల ఒక కుండలో నీటిని బాబా ఎంతోమందితో తాగించేవారు. అయినా అందు లో నీరు తరిగేది కాదు. ఇప్పటికి చాలామంది భక్తులు అందులోని నీరు తాగుతారు.
ద్వారకామయి దక్షిణం వైపు రెండు పాదా లు ఉన్నాయి. రోజూ ఆరతి అయ్యాక బాబా ఇక్క డ కొద్దిసేపు కూర్చునేవారు. ధుని నుంచి ఊదీ తీసి భక్తుల నుదుట పెట్టేవారు. మీకు శుభం జరుగుతుందని ఆశీర్వదించేవారు. 1886లో మూడు రోజులపాటు బాబా శరీరాన్ని విడిచిపెట్టి తిరిగి వచ్చిన అద్భుత ఘటన జరిగిన స్థలమిది. అందుకు గుర్తుగా ఇక్కడ తాబేలు బొమ్మ ప్రతి ష్టించారు. శ్యాంసుందర్‌ అనే గుర్రాన్ని బాబా అమితంగా ప్రేమించేవారు. హారతి సమయంలో దానిని చక్కగా అలంకరించి ఇక్కడ నిలబెట్టేవా రు. భక్తుల కోసం బాబా వంటచేసే సమయంలో ఇక్కడ ఉన్న గుంజకు ఆనుకుని కూర్చునేవారు. తమ గురువుకు గుర్తుగా సాయి ఇక్కడ అగ్నిని ప్రజ్వలింపచేశారు. దీనిని ధుని అంటారు. అది నేటికీ అఖండంగా వెలుగుతూనే ఉంది. ఈ ఊదీ ని ధరిస్తే అనా రోగ్యాలు పోతాయి. ద్వారకామ యి గురుకులం లాంటిది. ఎందరో ఇక్కడ జ్ఞాన సిద్ధి పొందుతుంటారు.బాబా సమాధికి ఒక వారం రోజుల ముందు ఒక పులి సద్గతి పొందిం ది. 1969 దీని విగ్రహాన్ని మసీదులో ప్రతిష్టించా రు. ఈ విగ్రహం పక్కనే ఉన్న రాయి మీదనే సాయంత్రం వేళ సాయిబాబా కూర్చునేవారు. ద్వారకామయిని దర్శించుకుంటే చాలు దు:ఖా లు పోయి సుఖసంతో షాలతో జీవిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement