Friday, May 17, 2024

ప్రపంచానికి ప్రేమను పంచిన మహనీయుడు సత్యసాయి బాబా …ప్ర‌ధాని మోడీ

పుట్టపర్తి: ప్రపంచానికి ప్రేమను పంచిన మహనీయుడు సత్యసాయి బాబా అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సాయి హీరా గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను వర్చువల్‌గా ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, .” కోట్లమందికి సత్య సాయిబాబా ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రపంచానికి ఆయన సేవా మార్గాన్ని చాటిచెప్పారని గుర్తు చేశారు. పుట్టపర్తి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం ఒక గొప్ప అనుభూతి అని చెప్పారు. సత్యసాయిబాబా నడియాడిన పుణ్యభూమికి నేను తప్పకుండా వస్తా. ప్రజలను ఆశీర్వదించేందుకు కాదు సత్యసాయి బాబా ఆశీర్వాదం పొందేందుకు…..గతంలో గుజరాత్ లో భూకంపం వచ్చినప్పుడు పేద ధనిక తారతమ్యం లేకుండా సత్యసాయిబాబా అందించిన సేవలు నాకు ఎంతో స్ఫూర్తి కలిగించాయి…..విద్యార్థులకు పౌష్టికాహారాన్ని దృష్టిలో పెట్టుకొని రాగిజావ పథకాన్ని సత్యసాయి ట్రస్ట్ ప్రారంభించడం అభినందనీయం. ఇదే స్ఫూర్తితో మరిన్ని రాష్ట్రాల్లోనూ ఈ పథకం అమలు కావాలని ఆశిస్తున్నా….” అని ప్ర‌ధాని పేర్కొన్నారు..

“సత్యసాయి బాబా పేరిట ఏర్పడిన జిల్లాను డిజిటలైజేషన్ చేసేందుకు, సాంకేతిక సేవలు అందించేందుకు ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తాం….. జీ 20 సదస్సుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం మనకు మన సంస్కృతి సాంప్రదాయాలను శాస్త్ర సాంకేతికతను వినియోగించుకుంటే మరింత వేగంగా ముందుకెళ్తాం…..పర్యావరణ పరిరక్షణకు సత్యసాయి ట్రస్ట్ అవలంబిస్తున్న సోలార్ పవర్ విధానాన్ని మరింత వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది….మనం ప్రారంభించిన యోగాను ప్రపంచ దేశాలు అనుసరిస్తుండడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. ఇదే స్ఫూర్తితో ముందుకెళితే ప్రపంచ దేశాలకు భారత్ ఆది గురువుగా నిలవడం ఖాయం… జపాన్ లో పర్యావరణ పరిరక్షణ కోసం శాస్త్ర, సాంకేతికతతో చిన్నచిన్న అడవులను సృష్టిస్తున్నారు. హీరా, సత్యసాయి ట్రస్ట్ సంయుక్తంగా ఇలాంటి అడవులను దేశంలోనూ సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా”….. అంటూ త‌న ప్ర‌సంగాన్ని ముగించారు మోడీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement