Sunday, May 19, 2024

BJP New Postings – ఎపి అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధీశ్వరి, తెలంగాణ ప్రెసిడెంట్ గా జి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ: ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులను బిజెపి నేడు మార్పు చేసింది.. తెలంగాణకు కిషన్ రెడ్డి, ఎపికి పురంధీశ్వరీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడి మార్పువిషయాన్ని ప్ర‌స్తుత‌ బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు స‌మాచారం అందించింది.. ఈ విషయాన్ని సోము వీర్రాజుకు జేపీ నడ్డా ఫోన్ చేసి చెప్పారు. కాగా దగ్గుబాటి పురంధీశ్వరీని కొత్త అధ్య‌క్షురాలిగా నియమించారు…. కాగా తెలంగాణ అధ్యక్షుడిగా జి కిషన్ రెడ్డి నియమితులయ్యారు.. ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ ను ఆ భాద్యతల నుంచి తప్పించారు.. అంతకు ముందు బండి తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.. ఇక ఈటల రాజేందర్ ను తెలంగాణ ఎన్నికల కమిటీ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించారు..

కాగా, 2020లో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే పార్టీ నాయకత్వం తీరుపై హైకమాండ్ అసంతృప్తితో ఉంది. బీజేపీకి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ ఇటీవలనే పార్టీ నుండి బయటకు వచ్చారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అలాగే ప‌లువ‌రు నేత‌లు కూడా ప‌క్క‌చూపులు చూస్తున్నారు.. దీంతో సోము వీర్రాజును త‌ప్పించ‌క త‌ప్ప‌లేదు కాగా తనకు పార్టీలో కొత్త బాధ్యతలు ఇస్తానని జేపీ నడ్డా హామీ ఇచ్చారని సోము వీర్రాజు వివరించారు.ఇక తెలంగాణలో బండి సంజయ్ దూకుడుగా వ్యవరించడంతో కొత్త మంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో అధ్యక్ష మార్పు అనివార్యమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement