Monday, April 29, 2024

AP: రోడ్డు ప్రమాదంలో హోంగార్డ్ మృతి

చెన్నేకొత్తపల్లి, ఫిబ్రవరి 5 (ప్రభన్యూస్): శ్రీ సత్య సాయి జిల్లా చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించే హోంగార్డు నాగప్ప ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే కనగానపల్లి మండలం తూముచెర్ల గ్రామంలో మంగళవారం జరిగే జాతర బందోబస్తులో భాగంగా సోమవారం రాత్రి తూముచెర్లలో విధులు నిర్వహించాడు.

మంగళవారం తెల్లవారుజామున విధులు ముగించుకొని నాగప్ప స్వగ్రామమైన మేడాపురంకు వెళ్తుండగా ఏలుకుంట్ల క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సు ఎద్దుల బండిని క్రాస్ చేస్తూ ద్విచక్ర వాహనంలో వెళ్తున్న నాగప్పను ఢీకొనడంతో హోంగార్డ్ నాగప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నాగప్ప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సికేపల్లి పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement