Monday, April 29, 2024

MBNR: రెండు డీసీఎంలు ఢీ.. ఇద్దరు మృతి..

మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల సమీపంలో ఉన్న స్నేహ చికెన్ సెంటర్ వద్ద రెండు డీసీఎం వాహనాలు ఢీకొని ఇద్దరు మృతిచెందారు. హైదరాబాద్ నుంచి అనంతపురం కూరగాయలను తీసుకురావడానికి వెళ్తున్న డీసీఎం వాహనం వేగంగా వెళ్తు స్నేహ చికెన్ సెంటర్ సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై అదుపు తప్పి ఢీకొని బెంగళూర్ – హైదరాబాద్ రహదారిపై బోల్తా పడింది.

అదే సమయంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ చేపలను తీసుకెళ్తున్న డీసీఎం రహదారిపై బోల్తా పడిన డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కూరగాయల డీసీఎంలో ఉన్న డ్రైవర్ సుధాకర్ వాహనం కింద పడి మృతిచెందాడు. మరో డీసీఎం వాహనంలో క్లీనర్ హైమద్ హుసేన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని చికిత్స కోసం మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. రహదారిపై చెల్లాచెదురుగా పడిన చేపలను జనాలు పట్టుకెళ్ళారు. కూరగాయల డీసీఎంలో ఉన్న బుట్టలను సైతం జనాలు తీసుకెళ్లారు. ప్రమాదం సమయంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు, ఎల్ అండ్ టీ కంపెనీ సిబ్బంది అక్కడకు చేరుకొని వాహనాలను ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement