Friday, April 26, 2024

రైలు కింద పడి నగర పంచాయతీ కమిషనర్‌ ఆత్మహత్య

అనంతపురం జిల్లా పుట్టపర్తి నగర పంచాయతీ కమిషనర్‌ మునికుమార్‌ కడప శివారులో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రాయచోటి రైల్వేగేట్‌ వద్ద మృతదేహం పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. కడప నగర పాలక కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేసిన ఆయన మూడు నెలల క్రితం పుట్టపర్తికి డిప్యూటేషన్‌పై బదిలీపై వచ్చారు. ముని కుమార్ రెండు రోజులు సెలవు పెట్టి గురువారం కడపకు వచ్చి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. నిన్న ఇంటి నుంచి బయలు దేరిన ఆయన ఇవాళ రాయచోటి రైల్వేగేట్‌ వద్ద శవమై కనిపించాడు. ఈ విషయం రైల్వే పోలీసులకు తెలియడంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని బంధువులకు సమాచారమివ్వగా వారు అక్కడికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే సీఐ మహమ్మద్ బాబా తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.పని ఒత్తిడి ఎక్కువగా ఉందని పలుమార్లు వాపోయినట్లు సన్నిహితులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement