Sunday, April 28, 2024

అనంతపురం జిల్లాలో కరుడుగట్టిన నేరస్తుల అరెస్ట్

అనంతపురం జిల్లాలో కరుడుగట్టిన నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సుంకర ప్రసాద్ నాయుడు ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సుంకర ప్రసాద్ నాయుడుతో పాటు 13మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక పిస్తోల్, 13 తూటాలు, స్కార్పియోతో పాటు రూ.6.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా తెలంగాణలో గత కొన్నేళ్లుగా హత్యలు, కిడ్నాప్ లు చేస్తోంది.

ప్రసాద్ నాయుడుపై రెండు రాష్ట్రాల్లో 11 కేసులు నమోదయ్యాయి. గత నెలలో గుంతకల్ లో స్వామిజీ ముత్యాల గంగరాజును ఈ ముఠా కిడ్నాప్ చేసింది. రూ.25లక్షలు ఈ ముఠా వసూలు చేసింది. స్వామిజీ ముత్యాల గంగరాజు పోలీసులను ఆశ్రయించారు. దీంతో నిందితులను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement