Saturday, April 27, 2024

కట్టుకున్న భర్తనే కడతేర్చిన భార్య..

తాడిపత్రి టౌన్ : కట్టుకున్న భ‌ర్త‌ని భార్యే కాటికి పంపించిన దారుణ సంఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో చోటు చేసుకుంది. తాడిపత్రి పట్టణంలోని ఓంశాంతి నగర్ లో నివాసం ఉంటున్న భర్త షేక్ అబ్దుల్‌ బాషా(30), భార్య అయేషాకు గత ఆరు సంవత్సరాల క్రితం వివాహమైంది. అబ్దుల్ భాష లారీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. బెంగళూరుకు డ్యూటీకి వెళ్లిన అబ్దుల్ భాషా బుధవారం రాత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి ఇంట్లో నిద్రిస్తున్న స‌మ‌యంలో త‌డ‌ని భార్య రోకలి బండ‌తో తలపై బాది హత్య చేసింది. హత్యకు కారణం కుటుంబ కలహాలు కారణమై ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. మృతుడికి నాలుగు సంవత్సరాలు బాబు, రెండు సంవత్సరాలు పాప ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement