Wednesday, May 8, 2024

సిద్దేశ్వరుడిని దర్శించుకున్న ఎమ్మెల్సీ తిప్పేస్వామి..

అమరాపురం మండల పరిధి హేమావతి గ్రామంలో హేమావతి హేంజేరు సిద్దేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కొన‌సాగుతున్నాయి..దీనిలో భాగంగా నిర్వ‌హించిన అగ్నిగుండం కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు. ముందుగా ఆయ‌న సిద్దేశ్వరుడుకి పంచా మృతం అభిషేకం చేయించారు. వివిధ రకాల పూలతో స్వామివారిని అలంకరించి ఘనంగా పూజలు నిర్వహించారు తదుపరి అగ్నిగుండం చేరుకొని భక్తిశ్రద్ధలతో అగ్నిగుండంలో ధూపం వేసి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు గోవిందరాజులు మాజీ సర్పంచి కుమారస్వామి మాజీ దేవాలయ కమిటీ అధ్యక్షులు ప్రకాష్ తదితర తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement