Sunday, May 19, 2024

Gadivemula : ప్రాణం తీసిన అమ్మ ఒడి..

గడివేముల (ఉమ్మడి కర్నూలు జిల్లా) : అమ్మ ఒడి సొమ్ము కోసం భార్య, భర్తల మధ్య జరిగిన ఘర్షణలో భర్త మృతిచెందిన సంఘటన బుధవారం నంద్యాల జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి… గడివేముల మండలంలోని కొర్రపోలూరు గ్రామంకు చెందిన మహిళకు ఇటీవల అమ్మ ఒడి కింద అకౌంట్లో డబ్బులు పడ్డాయి.

ఆ డబ్బులు డ్రా చేసుకొనిరావడంతో వాటిని తనకు ఇవ్వాలని భర్త లోకేశ్వరుడు అడగడంతో భార్య, భర్త ల మధ్య ఘర్షణకు కారణమైంది. ఈక్రమంలో భర్త లోకేష్ ను భార్య నెట్టివేయడంతో గోడకు బలంగా తల తాకడంతో లోకేశ్వరుడు అక్కడిక్కడే మృతిచెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement