Sunday, April 28, 2024

షిరిడీ నుండి తిరుపతికి ఎయిర్​ సర్వీసెస్..​ 27నుంచి తొలి ఫ్లైట్​ ప్రారంభం

షిరిడీ, ప్రభ న్యూస్​: మహారాష్ట్రలోని షిరిడీ నుంచి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని తిరుపతికి ఎయిర్​లైన్స్​ సేవలను ప్రారంభించనున్నట్టు మహారాష్ట్ర ఎయిర్​పోర్ట్​ డెవలప్​మెంట్​ అథారిటీ అధికారులు ఇవ్వాల వెల్లడించారు. ఈ మేరకు మార్చి 27 నుంచి విమాన సేవలు ప్రారంభమవుతాయని సంస్థ డిప్యూటీ చైర్మన్​, మేనేజింగ్​ డైరెక్టర్​ దీపక్​ కపూర్​ తెలిపారు. కాగా, ముందుగా ఈ విమాన సర్వీసు మార్చి 29 నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపినా.. కాస్త ముందుగానే అంటే ఆదివారం నుంచే సేవలు ఉంటాయని ఆయన చెప్పారు.

ఈ ఎయిర్​లైన్స్​ సేవలను స్సైస్​ జెట్​ ప్రారంభిస్తోందని, దేశంలోని ఈ రెండు ముఖ్యమైన దేవాలయాల సమూహానికి విమాన మార్గంలో కనెక్టివిటీ అనుసంధానించడం సంతోషకరమైన విషయమన్నారు. ఈ విమానం తిరుపతి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.45 గంటలకు షిర్డీ విమానాశ్రయానికి చేరుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement