Sunday, April 28, 2024

AP: వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు

ఏపీ అసెంబ్లీ స్పీకర్ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11గంటలకు స్పీకర్ ఎదుట హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అధికారులు లేఖ రాశారు.

గతంలో ఈనెల 12న విచారణకు రావాలని స్పీకర్ నోటీసులు జారీ చేయగా, వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నామని స్పీకర్‌కు ఆ ఎమ్మెల్యేలు లేఖ పంపించారు. తాజాగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అధికారులు నోటీసులు పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement