Thursday, April 25, 2024

TS: అరకొర ఆర్టీసి సేవలు…అవస్థలు పడుతున్న ప్రయాణికులు

చెన్నూర్, ప్ర‌భ‌న్యూస్‌: మూడు మండలాలతో పాటు మహారాష్ట్ర ప్రజల అవసరాలకు కేంద్ర బిందువైన చెన్నూరు నియోజకవర్గ కేంద్రానికి ఆర్టీసి సేవలు అరకొరగా సాగుతున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. చెన్నూరు కేంద్రంగా చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి మండలాల ప్రజలతో పాటు సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్ర ప్రజలు నిత్యం హైదరాబాద్, కరీంనగర్ వరంగల్, మంచిర్యాల పట్టణాలకు చెన్నూరు కేంద్రంగా ప్రయాణాలు సాగిస్తుంటారు.

మంచిర్యాల డిపోకు అధిక ఆర్థిక వనరుల సమకూర్చే ప్రాంతానికి ఆర్టీసి అధికారులు బస్సులు కేటాయించడంలో వివక్షత చూపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రయాణికులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. పెళ్ళిల సమయంలో మరింత ఇబ్బందులు పడుతున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెన్నూరు ప్రాంతానికి సమయానుకూలంగా బస్సులు వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement