Thursday, April 25, 2024

ఏపీ కరోనా అప్ డేట్ః రాష్ట్రంలో 15,157 యాక్టివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటలకలె 49,581 మంది సాంపిల్స్ ని పరీక్షించగా.. 1,145 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కోవిడ్ కారణంగా చిత్తూరులో నలుగురు, కడప, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడిచిన 24 గంటల్లో 1,090 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 15,157 యాక్టివ్ కేసులున్నాయి.  రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,28,795కి చేరింది. ఇందులో 19,99,651 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,987 మంది ప్రాణాలు కోల్పోయారు.  

ఇది కూడా చదవండిః సెల్ఫీ వీడియోః సీఎం సార్ న్యాయం చేయండి.. ఇక ఆత్మ‌హ‌త్యే దిక్కు..

Advertisement

తాజా వార్తలు

Advertisement