Thursday, May 2, 2024

Breaking: ఫైబర్ కేసులో ఆస్తుల అటాచ్ మెంట్ కు ఏసీబీ కోర్టు అనుమతి

ఫైబర్ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్ మెంట్ కు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. నిందితుల ఆస్తులను అటాచ్ మెంట్ చేసేందుకు ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఫైబర్ కేసులో రూ.114కోట్ల ఆస్తులను అటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతిచ్చింది.

ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో అక్రమాలకు పాల్పడిన వారి అస్తులు అటాచ్‌మెంట్ చేయాలని సీఐడి దాఖలు చేసిన పటిషన్ పై విచారించిన ఏసీబీ కోర్టు.. ఈ కేసులో ఆస్తుల అటాచ్మెంటుకు అనుమతించింది. 114 కోట్లు రూపాయల విలువ చేసే ఆస్తులను ఎటాచ్ చేసే ఆదేశాలు ఇవ్వాలంటూ ఎసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటీషన్ వేశారు. విచారణ చేసిన న్యాయమూర్తి.. ఆస్తుల ఎటాచ్ మెంట్ కు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement