Saturday, April 27, 2024

Big Breaking | నెల్లూరు జిల్లాలో ఘోరం.. కంటైనర్​ను ఢీకొన్న కారు, ఒకరు మృతి

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మనుబోలు జాతీయ రహదారిపై ఇవ్వాల (శుక్రవారం)ఈ యాక్సిడెంట్​ జరిగినట్టు తెలుస్తోంది. అదుపుతప్పిన ఓ కారు కంటైనర్​ను ఢీకొనడంతో ఈ యాక్సిడెంట్​ జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.

ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా ప్రకాశం జిల్లా పర్చూరు వాసులుగా పోలీసులు తెలిపారు. తిరుమల నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement