Tuesday, May 14, 2024

AP: ప్రభుత్వ సేవకులకు రోటరీ ఘన సన్మానం

సోంపేట, ఫిబ్రవరి 24 (ప్రభ న్యూస్) : సోంపేట పట్టణంలో ప్రజాసేవ చేసేందుకు ఏర్పాటు చేసిన‌ రోటరీ క్లబ్ 51వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ధి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వివిధ శాఖల నుండి ఉత్తమ ప్రభుత్వ సేవకులను గుర్తించి ప్రముఖుల చేతుల మీదుగా ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. ఈ మేరకు శనివారం సోంపేట పట్టణంలో రోటరీ క్లబ్ ఆవరణంలో ఒకేషనల్ సర్వీస్ అవార్డ్స్ నిర్వాహకుల ఆధ్వర్యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి విశ్రాంత రోటరీ గవర్నర్ పి డి జి కిషోర్ కుమార్, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ పి దినేష్ కుమార్ లు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని సోంపేట కంచిలి, కవిటి మండలాల పరిధిలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ ప్రజలకు మంచి సేవలు అందిస్తున్న సేవకులను గుర్తించి సంబంధిత వ్యక్తులను సన్మానించడం తమ అదృష్టంగా భావించారు.

ఈసందర్భంగా సోంపేట పోలీస్ సర్కిల్ విభాగం నుండి రైటర్ రమేష్ కుమార్ కు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న రామినాయుడు దంపతులకు, కంచిలి మండల సర్వేయర్ వి.నాగేశ్వరరావుకు, సోంపేట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న డిల్లేశ్వరరావుకు, ప్రభుత్వ ఆరోగ్యశాఖలో విధులు చేపడుతున్న ఐ.లక్ష్మణరావుకు, కవిటి మండలం దూగానపుట్టుగా గ్రామంలో జ్ఞానోదయ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి ఎంతోమంది నిరుద్యోగులకు బాసటగా నిలిచిన దూగాన తిరుపతిరావుకు, ఇటీవల కాలంలో తన అవయవాలను దానం చేసి కారణజన్ముడుగా నిలిచిన కిరణ్ చందు తల్లిదండ్రులు మోహన్ కళ్యాణులకు, రోటరీ క్లబ్ సర్వీస్ డైరెక్టర్ కొంచాడ.కిరణ్ కుమార్ దంపతులకు ఒకేషనల్ సర్వీస్ అవార్డ్ డైరెక్టర్ వుట్ల మనోజ్ కుమార్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు, కార్యదర్శి పీవీ కృష్ణారావు వారి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.

ఈసందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్రాంత రోటరీ గవర్నర్ పి డి జి కిషోర్ కుమార్ మాట్లాడుతూ… సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ధి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిత్యం చేపడుతున్న సేవా కార్యక్రమాలపై కొనియాడుతూ శ్రీనివాసరావుతో పాటుగా క్లబ్ సభ్యులకు ప్రత్యేకించి అభినందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement