Tuesday, April 30, 2024

వాగులో కొట్టుకుపోయిన కారు, ఒకరు మృతి.. ఫ్రెండ్‌షిప్ డే వేడుక‌ల్లో విషాదం

పాణ్యం (నంద్యాల జిల్లా) : ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులో కారు కొట్టుకుపోయిన ఘ‌ట‌న నంద్యాల జిల్లాలో ఇవ్వాల (ఆదివారం) జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఒకరు చ‌నిపోయారు. స్నేహితుల దినోత్సవం కావడంతో కర్నూలు జిల్లాకు చెందిన నలుగురు దోస్తులు కలిసి బనగానపల్లె పరిధిలోని కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కోసం బయలుదేరారు. ఇదే సమయంలో పాణ్యం మండలం రాయపాడు నుంచి గగ్గటూర్ మార్గ మధ్యంలో ఉన్న బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

అయితే కారుతో స‌హా నలుగురు వాగు దాటేoదుకు యత్నించగా నీటి ప్రవాహానికి కారు కొట్టుకోపోయింది. భారీ వర్షాలకు వాగులోకి వర్షపు నీరు పెద్ద ఎత్తున రావడం, ప్రవాహాన్ని గమనించకుండా వెళ్లడంతో కారు అదుపుతప్పి కొట్టుకపోయింది. గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ క్ర‌మంలో ముగురిని మాత్ర‌మం రక్షించారు. దినేష్ అనే వ్యక్తి చ‌నిపోయాడు. మృతుడు కర్నూలుకు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement