తొట్టంబేడు, ప్రభన్యూస్: చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం దుంగలతో తరలివెళ్తున్న ఓ కారు యాక్సిడెంట్కు గురైంది. పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై శ్రీకాళహస్తి సమీపంలోని పెద్ద కన్నలి ఎస్టీ కాలనీ వద్ద ఎర్రచందనం దుంగలతో వెళుతున్న కారు ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంటిని ఢీకొట్టింది. అంతలోనే బోల్తా పడి పల్టీలు కొట్టింది.
దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు పరారయ్యారు. కారు ఢీకొట్టడంతో ధ్వంసం అయిన ఇంటిలో నివసిస్తున్న రత్నమ్మ(49), భాస్కరయ్య (62)కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు, అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.