Saturday, April 27, 2024

AP: బైక్ ను ఢీకొన్న బ‌స్సు.. ఇద్ద‌రు మృతి

బుక్కరాయసముద్రం, మార్చి 23 (ప్రభ న్యూస్) : బుక్కరాయ‌సముద్రం మండలం రోటరీపురం వద్ద ఆనంతపురం – తాడిపత్రి హైవేపై ఎస్ఆర్ఐటి కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం జ‌రిగింది. బైక్ ను బ‌స్సు ఢీకొన‌డంతో బైక్ పై ఉన్న‌ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.


బైక్ పై వెళ్తున్న వ్యక్తులను పి వి కే కే ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు అతివేగంతో ఢీకొన్నట్లు స్థానిక ప్రజలు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి గల కారణం డ్రైవర్ బస్సును అతివేగంగా నడపడంతోనే ఇద్దరి నిండు ప్రాణాలను బలిగొన్నట్లు స్థానిక ప్రజలు వాపోయారు. మృతులు కడప జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement