Thursday, May 2, 2024

Breaking: కారు, బొలేరో వాహనం ఢీ.. 8 మంది కూలీలకు గాయాలు

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అమరావతి- అనంతపురం జాతీయ రహదారిపై కారు, బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు 108 వాహనంలో గాయపడ్డ వారిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.

గాయపడిన వారిలో ఇద్దరికి బలమైన గాయాలు కాగా..  మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ తరలించారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బొలెరో వాహనంలో మొత్తం 18 మంది ప్రయాణిస్తున్నారు. వీరందరూ కర్నూలు జిల్లా డోన్ నుంచి గుంటూరు కు మిరపకాయ కోతలకు వెళ్తున్న వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement