Monday, April 15, 2024

కాల్వ‌ల పనులకు కోవూరు ఎమ్మెల్యే శంకుస్థాపన

బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 13వ వార్డులో కోటి రూపాయలతో సైడ్ కాల్వ‌లు నిర్మాణం చేపడుతున్నట్లు కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన అందుకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని పనులు ప్రారంభించారు. వీరి వెంట చైర్ ప‌ర్స‌న్ మార్ల సుప్రజా మురళి, జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, 13వ వార్డు కౌన్సిలర్ పుట్టా లక్ష్మీకాంతమ్మ, వవ్వేరు కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సూరా శ్రీనివాసులు రెడ్డి, నగర కమిషనర్ శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement